JGL: దసరా ఉత్సవాల్లో భాగంగా పట్టణంలోని పురాతన దేవాలయమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు గురువారం చేపట్టారు. ఈ వేడుకల్లో భాగంగా స్వామివారు “హంస” వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. కాగా శ్రీనివాసున్ని రథంపై అందంగా అలంకరించి పట్టణంలోని పుర వీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లారు.