WGL: మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు రేపు జరగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల పరిధిలోని పోలింగ్ కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని సీపీ ప్రీత్ సింగ్ తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా, పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం నిషేధించారు.