ప్రకాశం: పొదిలిలో విజిలెన్స్ అధికారులు సోమవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. రికార్డులు పరిశీలించిన అధికారులు విశ్వనాధపురంలోని ఓ ఎరువుల దుకాణదారుడిపై కేసు నమోదు చేసి, అక్రమంగా నిల్వఉంచిన రూ.20 లక్షలు విలువచేసే 1704 బస్తాల ఎరువులను అధికారులు సీజ్ చేశారు. ఏవో మాట్లాడుతూ.. కృత్రిమ ఎరువుల కొరత సృష్టించేందుకు వ్యాపారులు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.