RR: షాద్నగర్ పట్టణంలోని పద్మావతి కాలనీ రోడ్డు విస్తరణ నేపథ్యంలో కంకర వేసి నిర్మాణం చేపట్టకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. 2 నెలలు కావస్తున్న రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో వాహనదారులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు అవస్థలు పడుతున్నారని వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టాలని కోరుతున్నారు.