RR: మన్సురాబాద్ డివిజన్ జడ్జెస్ కాలనీ ఫేజ్-1లో భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి దేవాలయంలో దీపోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి భక్తులతో కలిసి దీపోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక శక్తి మనసుకు శాంతిని ఇస్తుందని, సమాజానికి ఐక్యతను తెస్తుందన్నారు.