WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా పత్తికి రూ. 7,320 ధర వచ్చింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు రూ. 16వేలు పలకగా… వండర్ హాట్(WH) మిర్చి రూ. 19 వేలు పలికింది. తేజ మిర్చి ధర రూ. 14,200 కి చేరింది. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.