MDK: తన తల్లి అదృశ్యమైందని మద్దూరి నవీన్ చారి శనివారం రామాయంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రామాయంపేట మున్సిపల్ పరిధికి చెందిన మద్దూరి మురళి భార్య లక్ష్మీ (58) ఈ నెల 9వ తేదీన ఇంటి నుండి బయటకు వెళ్లిన తర్వాత తిరిగి రాలేదు. కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.