SDPT: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య సోమవారం హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ సాంఘిక సంక్షేమ గురుకులాన్ని సందర్శించనున్నారు. ఈ నెల 7న అనుమానాస్పదంగా మరణించిన దళిత విద్యార్థి సానాది వివేక్ మృతి ఘటనపై ఆయన విచారణ చేపట్టనున్నారు. ఈ పర్యటనలో ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని జాతీయ మాల మహానాడు ఇంఛార్జి ఆరె కిషోర్ కోరారు.