సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో అర్ష్దీప్ సింగ్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. తన కట్టుదిట్టమైన బౌలింగ్తో 4 ఓవర్లలో కేవలం 13 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టి విజయంలో కీలక పాత్ర పోషించాడు. గత మ్యాచ్లో ఒకే ఓవర్లో 7 వైడ్లు వేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే, ఈ మ్యాచ్లో అద్భుత బౌలింగ్తో ‘MOM’ అవార్డు దక్కించుకోవడం విశేషం.