ఈడీ(ED)కి ఇచ్చిన వాంగ్మూలాలను ఉపసంహరించుకుంటూ హైదరాబాద్(hyderabad) వ్యాపారవేత్త అరుణ్ పిళ్లై(Ramachandra Pillai) ఢిల్లీ(delhi) కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో కోర్టు ఈడీ ఏజెన్సీకు నోటీసులు జారీ చేసింది. అయితే అరుణ్ పిళ్లై కవిత బినామీగా ఉన్నట్లు గతంలో ఈడీ(ED)కి తెలిపాడు. ఇప్పుడు అదే వాంగ్మూలం వెనక్కి తీసుకోవడం పట్ల రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఉద్యోగాలు ఇప్పించేందుకు కొంతమంది అభ్యర్థుల నుండి (Land for jobs scam case) ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం (Lalu Prasad Yadav family) భూములు తీసుకున్నదన్న అభియోగాల నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి కేంద్ర విచారణ సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (enforcement directorate) తేజస్వి యాదవ్ నివాసంలో ఢిల్లీలోని (Tejaswi Yadav) నివాసంలో సోదాలు నిర్వహించింది.
పార్లమెంటులో బీసీ(BC) బిల్లు(Bill) ప్రవేశపెట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య(R Krishnaiah) డిమాండ్ చేశారు. ఆయా రాష్ట్రాల్లోని చట్టసభల్లో బీసీలకు 56 శాతం రిజర్వేషన్లు(reservations) కల్పించాలని కోరారు. బీసీ(BC)లకు చట్టసభల్లో రిజర్వేషన్ల బిల్లు అంశంపై ఏప్రిల్ 3న ఢిల్లీ(delhi)లో ధర్నా చేయనున్నట్లు చెప్పారు.
CM KCR : తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభానికి ముహూర్తం ఖరారయింది. ఏప్రిల్ 30న తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అధికారులతో పాటు కొత్త సచివాలయాన్ని పరిశీలించిన సీఎం కేసీఆర్ ప్రస్తుతం జరుగుతున్న పనులు గురించి ఆరా తీశారు.
దేశానికి సరికొత్త రాజకీయాలను (politics) పరిచయం చేస్తామని, అవినీతి లేని రాజకీయమే (Clean Politics) తమ లక్ష్యమని చెప్పి, అధికారంలోకి వచ్చాక మాత్రం నిండా అవినీతిలో మునిగిపోయిన ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) టార్గెట్ గా భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) పకడ్బంధీగా ముందుకు సాగేందుకు సద్ధమవుతోంది.
Naveen:బీటెక్ స్టూడెంట్ నవీన్ (Naveen) హత్య కేసు సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తోంది. పోలీసుల విచారణలో రోజుకో విషయం వెలుగుచూస్తోంది. నిహారిక (niharika) ఈ రోజు పలు కీలక అంశాలను తెలిపింది. హరి హర (hari hara) తాను లవ్ (love)లో ఉన్నామని చెబుతూనే.. నవీన్ (Naveen) హత్య గురించి ప్రస్తావించింది.
మీకు విశ్వసనీయత, నిజాయితీ ఉంటే తాను బీజేపీలో చేరినందుకు 18వేల కోట్ల కాంట్రాక్టు పొందానని చేసిన ఆరోపణలను నిరూపించాలని బీజేపీ(BJP) నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal reddy) మంత్రి కేటీఆర్(KTR)కు సవాల్ విసిరారు. తనపై తప్పుడు ప్రచారం చేసి మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) పార్టీ గెలిచిందని పేర్కొన్నారు.
అభివృద్ధి పనుల కోసం ప్రజలు కొన్ని రోజులు సహకరించాలని విన్నవించారు. మళ్లింపుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లితే ప్రయోజనంగా ఉంటుందని చెప్పారు. స్థానికులు సహకరించాలని కోరారు.
భారత రాష్ట్ర సమితి నాయకురాలు (Bharata Rashtra Samithi - BRS), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC kavitha) కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు (Congress Party) సోనియా గాంధీ (Sonia Gandhi) పైన ప్రశంసలు కురిపించడంతో పాటు, ఆ పార్టీని తన నిరసన దీక్షకు ఆహ్వానించారు.
BRS MLC : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దేశరాజధాని ఢిల్లీలో దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద్ ఆమె ఈ దీక్ష చేపట్టారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే పెట్టాలని కోరుతూ కవిత నేతృత్వంలో ఇవాళ ఒక్క రోజు దీక్ష నిర్వహిస్తున్నారు. కాగా...ఆమె దీక్షకు అనూహ్య స్పందన లభిస్తోంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు వారంతంలో(friday) భారీ నష్టాల(heavy losses)తో కొనసాగుతున్నాయి. ఒక దశలో బీఎస్ఈ(BSE) సెన్సెక్స్ 700 పాయింట్లు కోల్పోగా, ఎన్ఎస్ఈ(NSE) నిప్టీ 202కిపైగా పాయింట్లను నష్టపోయింది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ(BANK NIFTY) సూచీ ఒక సమయంలో ఏకంగా 810 పాయింట్లను కోల్పోయింది.
ఉత్తర జర్మనీ(Germany) హాంబర్గ్(Hamburg)లోని యెహోవాసాక్షి చర్చిలో గురువారం రాత్రి కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఏడుగురు మరణించారని, మరో ఎనిమిది మంది గాయపడ్డారని అక్కడి మీడియా తెలిపింది.
Muni Swami : ఓ బీజేపీ ఎంపీ ఓ మహిళ పట్ల దారుణంగా ప్రవర్తించాడు. మహిళ ముఖాన బొట్టు పెట్టేకోలేదని విమర్శించాడు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Naresh and Pavitha Lokesh are Knot:నటుడు నరేశ్ (naresh)- పవిత్ర లోకేశ్ (pavitra) ప్రేమాయణం గత కొద్దిరోజుల నుంచి హాట్ టాపిక్ అయ్యింది. నరేశ్ భార్య రమ్య రఘుపతి (ramya) అభ్యంతరం వ్యక్తం చేయడంతో రచ్చ రచ్చ అయ్యింది. పవిత్ర లోకేశ్ను (pavitra) నరేశ్ (naresh) పెళ్లి చేసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. మైసూరులో (mysore) కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వీరు కొత్త జీవితాన్ని ప్రారంభించారని సమాచారం.