రైల్వే సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ద్వారా రైల్వేల ప్రైవేటీకరణ జరుగుతుందంటూ ప్రతిపక్షాలు తప్పుడు కథనాలు తెరపైకి తెచ్చాయని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మండిపడ్డారు. రైల్వేల ప్రైవేటీకరణ వంటి అంశం లేదని స్పష్టం చేశారు. రైల్వే బోర్డు పనితీరును మరింత మెరుగుపర్చడంతోపాటు స్వతంత్రతను పెంపొందించేలా రైల్వే సవరణ బిల్లు తీసుకొచ్చినట్లు తెలిపారు.