AP: కలెక్టర్ల కాన్ఫరెన్స్లో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. వాట్సాప్ గవర్నన్స్పై కాన్ఫరెన్స్లో కీలక చర్చ జరిగింది. ప్రభుత్వ సమాచారం అంతా ఒకే చోట ఉండేలా వెబ్సైట్ను తీర్చిదిద్దుతామని తెలిపారు. వాట్సాప్ ద్వారా 153 సేవలు ఇచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని..10 రోజుల్లో ఈ సేవలు ప్రారంభమవుతాయని చెప్పారు. జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీ విధానాన్ని రీఇంజనీరింగ్ చేయాల్సి ఉందన్నారు.