ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ రావటం కలకలం రేపింది. ముంబై నుంచి ఢిల్లీకి వెళ్తున్న విమానంలో బాంబు పెట్టినట్లు దుండగులు బెదిరించారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు ఢిల్లీ విమానాశ్రయంలో ఎమర్జెన్సీని విధించి బాంబ్ స్క్వాడ్తో తనిఖీలు చేశారు. విమానంలోని 200 మంది ప్రయాణికులను దించి సోదాలు చేయగా.. పేలుడు పదార్ధాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.