ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న విద్యార్థులతో పరీక్షా పే చర్చ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు క్రికెటర్లను స్పూర్తిగా తీసుకుని చదువు నేర్చుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. మైదానంలో బ్యాటర్ల తరహాలో విద్యార్థులు ఒత్తిడిని హ్యాండిల్ చేయాలని ప్రధాని తెలిపారు. పిల్లలో ఉన్న నైపుణ్యాన్ని టీచర్లు వెలికితీయాలన్నారు.