• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

పట్టాలు తప్పిన రైలు

AP: అల్లూరి సీతారామరాజు జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. బొర్రాగుహలు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలు తప్పినట్లు రైల్వే సిబ్బంది వెల్లడించారు. దీంతో కొత్తవలస-కిరణ్ డోలు మార్గంలోని ప్యాసింజర్ రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

December 20, 2024 / 07:19 AM IST

నంద్యాలలో అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్న కుందూ మొరుసు

నంద్యాలలో అక్రమంగా కుందూ మొరుసును తరలిస్తున్నారు. అక్రమార్కులకు కుందూ మొరుసు కాసుల వర్షం కురిపిస్తుంది. ఉదయం నుంచి రాత్రివరకు కుందూలో యదేచ్చగా తవ్వకాలు జరుపుతున్నారని పీవీ నగర్ వాసులు తెలిపారు. రోజు 20 ట్రాక్టర్లలో మొరుసు తోలుకొని సొమ్ము చేసుకుంటున్నారు. ట్రాక్టర్ మొరుసు ధర రూ.1,600 నుంచి రూ.2,000 వేల వరకు అమ్ముతున్నారు.

December 20, 2024 / 07:16 AM IST

హోటల్‌లో పేలిన సిలిండర్‌లు

కృష్ణా: విజయవాడ రూరల్ మండలంలోని గూడవల్లి జాతీయ రహదారి వెంబడి ఓ కారులో షోరూం పక్కన హోటల్లో గురువారం రాత్రి ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్స్ పేలి మంటలు వ్యాపించాయి. చుట్టుపక్కల షాపులు, నివాసాలలో జనాలు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

December 20, 2024 / 06:34 AM IST

60 లీటర్ల నాటుసారా పట్టివేత

ATP: గుత్తి పట్టణ శివారులోని 44వ జాతీయ రహదారిపై బైక్‌పై అక్రమంగా నాటుసారా తరలిస్తున్న ముగ్గురిని ఎక్సైజ్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 60 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. బైక్‌ను సీజ్ చేశారు. 2,200 లీటర్ల నాటుసారా బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై ఎక్సైజ్ సీఐ మోహన్ రెడ్డి కేసు నమోదు చేశారు.

December 20, 2024 / 06:11 AM IST

మనస్థాపానికి గురై విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

E.G: మనస్థాపానికి గురై విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన గురువారం రమణక్కపేటలో చోటుచేసుకుంది. స్థానికులు వివరాల ప్రకారం.. పదవ తరగతి చదువుతున్న చింతపల్లి నైపుణ్య (16) అనే విద్యార్థిని పరీక్షల సమయం దగ్గర పడుతుందని, చదువుపై దృష్టి పెట్టాలని తల్లి మందలించడంతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగింది.

December 20, 2024 / 06:08 AM IST

ఫస్ట్ నైట్‌లో గంజాయి, బీరు కావాలన్న వధువు

కొత్తగా పెళ్లి అయిన వ్యక్తికి మొదటి రాత్రి రోజే పెళ్లి కూతురు షాక్ ఇచ్చింది. తొలి రాత్రిలో తనకు బీరు, గంజాయి, మటన్ కోరడంతో ఈ ముచ్చట పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఈ ఘటన యూపీలో చోటు చేసుకుంది. ముహ్ దిఖాయ్ ఆచారంలో భాగంగా తనకు బీరు, గంజాయి, మాంసం కావాలనడంతో విస్తుపోయిన వరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా వధువు ఆడది కాదని, థర్డ్ జెండర్ అని వరుడి కుటుంబ సభ్యులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

December 20, 2024 / 03:20 AM IST

ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న షీ టీం

TG: మహిళలను ఇబ్బందులు పెడుతున్న ఆకతాయిలను షీ టీం పట్టుకుంది. హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్ సమీపంలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారన్న సమాచారంతో నిన్న రెక్కీ నిర్వహించిన షీ టీం పోలీసులు 20 మంది పోకిరీలను పట్టుకొని తమదైన శైలిలో కౌన్సిలింగ్ ఇచ్చారు.

December 20, 2024 / 01:40 AM IST

కొకైన్ విక్రయిస్తున్న షార్ట్ ఫిలిం ఫొటో గ్రాఫర్

TG: గోవా నుంచి అక్రమంగా కొకైన్ తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కృష్ణా నగర్‌కు చెందిన సయ్యద్ అజర్ హస్మీ అనే యువకుడు షార్ట్ ఫిలిం ఫొటో గ్రాఫర్‌గా పని చేసేవాడు. బంజారాహిల్స్‌కు చెందిన క్రాంతి అనే వ్యక్తితో కలిసి గురువారం మ.2 గం.లకు జూబ్లీహిల్స్‌లో విక్రయిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

December 20, 2024 / 01:31 AM IST

పాల వ్యాన్ ఢీకొని రెండవ తరగతి చిన్నారి మృతి

KNR: చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో ప్రభుత్వం పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్న మహి(7) అనే చిన్నారి పాఠశాల నుంచి ఇంటికి వెళుతున్న క్రమంలో మిల్క్ వ్యాన్ ఢీకొనడంతో తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించే మార్గమధ్యలో మృతి చెందింది. పాప తండ్రి మహేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిల్క్ వ్యాన్ డ్రైవర్‌పైన కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజేష్ తెలిపారు.

December 19, 2024 / 08:12 PM IST

అదుపుతప్పి పత్తి ట్రాక్టర్ బోల్తా..!

NGKL: అమ్రాబాద్ మండలంలోని కొత్తపల్లి గ్రామ శివారులో గురువారం అమ్రాబాద్ ప్రధాన రహదారిపై ఇవాళ అదుపుతప్పి పత్తి లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఘటనలో ప్రాణాపాయం తప్పింది. రోడ్డుపై ట్రాక్టర్ బోల్తా పడటంతో వాహనాల రాకపోకలకు స్వల్ప అంతరాయం నెలకొంది. ఘటనకు సంబందించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

December 19, 2024 / 07:36 PM IST

గండిపేట చౌరస్తాలో రోడ్డు ప్రమాదం

RR: గండిపేట చౌరస్తా వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. టిప్పర్ లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. దీంతో డివైడర్ మధ్యలో కరెంట్ ఫోల్ రోడ్డు అడ్డంగా పడిపోయింది. కారులో ఉన్న వారికి స్వల్ప గాయాలు కావడంతో అంతా ఊపరి పీల్చుకున్నారు. విద్యుత్ అధికారులు విద్యుత్ స్థంబాన్ని తొలగించారు.

December 19, 2024 / 04:18 PM IST

ట్రాలీ ఆటో ఢీ: యువకుడికి తీవ్రగాయాలు

NZB: ట్రాలీ ఆటో ఢీకొని యువకుడికి తీవ్రగాయాలైన ఘటన మల్కాపూర్‌ గండి వద్ద చోటుచేసుకుంది. మల్కాపూర్‌కు చెందిన యువకుడు గురువారం ఉదయం బైక్‌పై వెళ్తుండగా మల్కాపూర్‌ గండి వద్ద ట్రాలీ ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో ఆటో రోడ్డుకిందకు దూసుకెళ్లింది.

December 19, 2024 / 02:11 PM IST

మచిలీపట్నంలో యువకుడు సూసైడ్

కృష్ణా: కుటుంబ కలహాల నేపథ్యంలో మచిలీపట్నంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజుపేటకు చెందిన కేశన జాను(21) ముఠా కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గత ఏడాది వివాహం జరగ్గా, కుటుంబ కలహాల నేపథ్యంలో గురువారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకి హాస్పిటల్‌కు తరలించారు.

December 19, 2024 / 01:16 PM IST

విద్యుత్ తీగలు తగిలి గడ్డి దగ్ధం!

NRPT: నారాయణపేట మండలం బొమ్మను పాడు గ్రామంలో గురువారం గొల్ల పెంటప్ప అనే వ్యక్తి వరి గడ్డివాము ట్రాక్టర్‌లో వేసుకొని వెళ్తున్న క్రమంలో పైన వున్న విద్యుత్ తీగలు తగిలి గడ్డి వాముకు నిప్పు అంటుకుంది. గమనించిన రైతు ట్రాక్టర్ ఇంజన్‌‌ను వేరు చేశాడు. అనంతరం ఫైర్ స్టేషన్‌కు ఫోన్ చేయడంతో వారు వచ్చి మంటలను ఆర్పివేశారు. అప్పటికే గడ్డి మొత్తం కాలి బూడిద అయింది.

December 19, 2024 / 12:50 PM IST

ఘోర రోడ్డు ప్రమాదం.. 52 మంది మృతి

ఆఫ్ఘనిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘాజ్నీ ప్రావిన్స్‌లో రెండు బస్సులు, ఆయిల్ ట్యాంకర్‌, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో దాదాపు 52 మంది మృతి చెందగా.. మరో 65 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

December 19, 2024 / 12:46 PM IST