CTR: శాంతిపురం మండలం సోలిశెట్టిపల్లి గ్రామంలో గోవింద్ అనే వ్యక్తిని భార్య మీనా, ఆమె ప్రియుడు ఆనంద్ సహాయంతో హతమార్చిన వైనం వెలుగు చూసింది. భర్త గోవింద్ కళ్లల్లోకి కారం చల్లి, రాయితో కొట్టి హతమార్చినట్లు గ్రామస్థులు తెలిపారు. అక్రమ సంబంధంతోనే గోవింద్ హత్యకు గురైనట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అన్నమయ్య: ఓబులవారిపల్లి మండలం మంగంపేట 10వ వీధి ఆర్ఆర్ సెంటర్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గుత్తా ఆంజనేయులు(59) తన ఇంట్లో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి అతని తలపై నరికి హత్య చేశారని పోలీసులు తెలిపారు. హత్య ఎవరు చేశారు? హత్యకు గల కారణాలు ఏంటి? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
TPT: నగరంలోని ఫిష్ మార్కెట్ ఎదురుగా ఉన్న సాక్వెంజర్ కాలనీలో లావణ్య తన పెంపుడు కుక్కను స్థానికంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు శుక్రవారం సాయంత్రం ఇంటికి వచ్చి కత్తులతో కిరాతకంగా నరకడంతో పెంపుడు కుక్క చనిపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఆ స్టేషన్ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆమె వాపోయింది.
MHBD: ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. కొత్తగూడ మండలం తిరుమలగండికి చెందిన ఈసం రుత్విక్ గూడూరు పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. కొద్దిరోజులుగా పదో తరగతి విద్యార్థులు తనను వేధిస్తున్నారని బాలుడు పలుమార్లు యాజమాన్యానికి తెలిపాడు. అయితే ఎవరు పట్టించుకోవడంతో ఈరోజు ఎలర్జీమందు తాగి సూసైడ్ అటెంప్ట్ చేసాడు.
ATP: ఉరవకొండ పట్టణ శివారులోని గుంతకల్లు రోడ్డు హంద్రీనీవా ఉప కాలువ వద్ద శనివారం ఉదయం అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కర్నూలు జిల్లా పెరవళి గ్రామానికి చెందిన సత్యనారాయణ కుటుంబం ఉరవకొండలో లగ్నపత్రిక రాసుకోవడానికి ఆటోలో ప్రయాణమయ్యారు.
NLR: కావలి మండలం మద్దురుపాడు లారీ స్టాండ్ వద్ద మూడు లారీలను కావలి వన్ టౌన్ పోలీసులు పట్టుకున్నారు. వాటిలో సుమారు 600 అక్రమ రేషన్ బియ్యం బస్తాలు ఉన్నాయి. దీనిపై ఎస్ఐ సుమన్ను వివరణ కోరగా, ఆయన తమకు రాబడిన సమాచారం మేరకు దాడులు నిర్వహించామన్నారు. మూడు అశోక్ లేలాండ్ లారీలను పట్టుకోగా వాటిలో సుమారు 600 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం తెలిపారు.
W.G: తాళ్లపూడి మండలంలో జూద స్థావరంపై పోలీసులు దాడులు జరిపారు. అన్నదేవరపేట గ్రామంలో పేకాట సిబరంపై దాడులు నిర్వహించగా.. నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. వారి వద్ద నుంచి రూ.8,130 నగదు స్వాదీనం చేసుకున్నామన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
VZM: దత్తిరాజేరు మండలంలోని పెదమానాపురం గ్రామం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గొర్రెల కాపరి మృతి చెందగా, మరో ఆరు పశువులు అక్కడికక్కడే చనిపోయాయి. వంగర గ్రామానికి చెందిన మహేష్ గొర్రెల మందను పెదమానాపురం సంతకు తీసుకు వస్తుండగా పార్వతీపురం నుంచి విజయనగరం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో మహేష్, మరో ఆరు గొర్రెలు మృతి చెందినట్లు ఎస్సై జయంతి తెలిపారు.
హిమాచల్ ప్రదేశ్లో ఇవాళ తెల్లవారుజామున భూకంపం సంభవించింది. భూప్రకంపనలకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.3గా నమోదైంది. దీని కేంద్రం భూమికి 5 కిలోమీటర్ల దిగువన ఉంది. తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో చాలామంది గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మండి నగరాన్ని భూకంపం తాకింది. మూడుసార్లు ప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తోంది.
NZB: బిక్కనూర్ మండలంలోని కంచర్ల గ్రామం నుంచి పెద్ద మల్లారెడ్డి గ్రామాల మధ్య రోడ్డు సక్రమంగా లేకపోవడంతో పలు ప్రమాదాలు జరుగుతున్నాయి. గ్రామం నుంచి రైస్ మిల్లుకు వడ్లను తరలిస్తున్న ట్రాక్టర్ రోడ్డుపై గుంతల పడటంతో బోల్తా పడింది. కాగా ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు. గుంతలుగా మారిన రోడ్డును వెంటనే బాగు చేయాలని అధికారులను కోరారు.
ఈ ఏడాదిలో భారత్లో తుఫాన్లు, కొండచరియలు విరిగిపడటం, వరదలు వంటి విపత్తులు సంభవించాయి. జూలై 30న కేరళలోని వయనాడ్ జిల్లాలో పెద్దఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. మేలో ఉత్తర హిందూ మహాసముద్రంలో ఏర్పడిన రెమాల్ తుఫాను కారణంగా భారీ నష్టం వాటిల్లింది. నవంబర్లో ఫెంగల్ తుఫాను బీభత్సం సృష్టించింది. APలో భారీగా వరదలు వచ్చాయి. అలాగే హిమాచల్ ప్రదేశ్, అసోంలో సంభవించిన వరదల కారణంగా చాలా మంది నిరా...
VSP: పరవాడ ఫార్మసిటీలోని విజయశ్రీ ఆర్గానిక్ కంపెనీలో శుక్రవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు యూపీకి చెందిన NMR కార్మికుడు రాజు, పరవాడకు చెందిన ఆపరేటర్ సీహెచ్ వెంకట సత్య సుబ్రహ్మణ్య స్వామి (59)గా గుర్తించారు. విశాఖలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
HNK: పరకాల పట్టణంలో జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న ఇసుక లారీ ఆటోను ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు గాయాలయ్యాయి. తీవ్ర గాయాల పాలైన వేముల సాత్విక (12) వరంగల్ ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ సాత్విక మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేపట్టారు.
దేశ రాజధాని ఢిల్లీలో కాల్పులు కలకలం సృష్టించాయి. సునీల్ జైన్ అనే వ్యక్తిని దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటన ఫ్లోర్ మార్కెట్ ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా పరిశీలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
NLR: నాయుడుపేట స్వర్ణముఖి నదిలో ఇష్ట రాజ్యాంగ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. తుమ్మూరు సమీపంలో స్వర్ణముఖి నదిలో బ్రిటిష్ కాలం నాటి బ్రిడ్జిల వద్ద భారీ స్థాయిలో అక్రమ తవ్వకాలు చేపట్టి ట్రాక్టర్లలో తరలించుపోతున్నారు.