• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు మృతి

HNK: కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామానికి చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు రాజమౌళి కన్నుమూశారు. మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో హిందీ అధ్యాపకుడు ఆయన కొన్నేళ్లు బోధించారు. అనారోగ్యం కారణంగా నేడు తెల్లవారు జామున మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

December 15, 2024 / 09:44 AM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ ఘటన

BDK: ఆడపిల్ల పుట్టిందని తల్లిదండ్రులు అమ్మేసిన ఘటన భద్రాద్రి జిల్లాలో వెలుగు చూసింది. పోలీసుల వివరాలు.. జూలూరుపాడు మం. కొమ్ముగూడెంకు చెందిన ఓ మహిళ గత అక్టోబర్‌లో ఆడ పిల్లకు జన్మనిచ్చింది. అప్పటికే పాప, బాబు ఉండగా మళ్లీ ఆడపిల్ల పుట్టడంతో సాకలేమని లక్ష్మిదేవిపల్లి మం. చెందిన దంపతులకు లక్ష రూపాయలకు అమ్మినట్టు తెలిస్తొంది.

December 15, 2024 / 09:20 AM IST

ప్రకాశం బాలుడు మిస్సింగ్.. గుడ్లూరులో ఆచూకీ

NLR: ప్రకాశం జిల్లాలో అదృశ్యమైన ఓ బాలుడు నెల్లూరు జిల్లాలో దొరికిన ఘటన శనివారం జరిగింది. ప్రకాశం SP మాట్లాడుతూ.. ఒడిశా నుంచి నాలుగేళ్ల క్రితం ప్రదీప్ దంపతులు ఇద్దరు పిల్లలతో ఒంగోలు వచ్చారు. పక్క ఇంట్లో బాయ్ ఫ్రెండ్‌‌తో ఉంటున్న ఓ మహిళ ప్రదీప్ పిల్లలపై కన్నేసింది. ఫ్రెండ్‌‌తో కలిసి శుక్రవారం 10 నెలల బాలుడిని ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. పోలీసులు గాలించగా.. నెల్లూరులో దొరికినట్లు...

December 15, 2024 / 08:42 AM IST

శంకర్పల్లిలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

HYD: శంకర్పల్లి PS పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండల పరిధి హుస్సేన్పూర్ గ్రామం నుంచి ఓ వ్యక్తి బైక్‌పై 13వ తేదీ అర్ధరాత్రి కొత్తపల్లి గ్రామం వైపు బయల్దేరాడు. కొత్తపల్లి గ్రామ బీరప్ప ఆలయం సమీపానికి రాగానే గుర్తుతెలియని వాహనం అతడి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు.

December 15, 2024 / 08:36 AM IST

బైక్ ఢీకొని వ్యక్తి మృతి

SKLM: కంచిలి మండలం కొన్నాయిపుట్టుగ సమీపంలో సంభవించిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. మాణిక్య పురానికి చెందిన రమేష్ అనే వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుండగా అటుగా వస్తున్న ద్విచక్రవాహనదారుడు ఢీకొట్టాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

December 15, 2024 / 08:26 AM IST

పేకాట శిబిరంపై దాడి..8 మంది అరెస్ట్

SKLM: నరసన్నపేట మండలంలో జమ్ము గ్రామ పరిసరాలలో ముందస్తు సమాచారంతో పేకాట శిబిరంపై దాడి చేయడం జరిగిందని ఎస్సై సి. హెచ్ దుర్గాప్రసాద్ తెలిపారు. శనివారం జమ్ము గ్రామంలోని ఒక మిల్లు వద్ద పేకాట ఆడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. 1,300 రూపాయలు, ఒక మొబైల్ స్వాధీనం చేసుకున్నామన్నారు. 8 మందిని అరెస్టు చేయడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు.

December 15, 2024 / 08:24 AM IST

పుట్టినరోజు నాడు తీవ్ర విషాదం

KRNL: రాజంపేటలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లాకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. కోవెలకుంట్లకు చెందిన కిరణ్ రాజంపేట ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్నాడు. శనివారం కిరణ్ పుట్టినరోజు కావడంతో పులివెందులకు చెందిన ఫ్రెండ్ బన్నీ చెన్నైలో చదువుతూ రాజంపేటకు వచ్చారు. కాగా, వీరి ఇరువురినీ ఆర్టీసీ బస్సు ఢీకొని పుట్టినరోజు నాడే మృతి చెందాడు.

December 15, 2024 / 08:10 AM IST

ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

SRPT: ఆర్థిక ఇబ్బందులతో పాటు కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నసంఘటన తుంగతుర్తి మండలం గొట్టిపర్తిలో శనివారం చోటుచేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన తునం అంజయ్య(36) గత కొన్ని సంవత్సరాలుగా భార్య పిల్లలతో హైదరాబాద్‌లో స్థిరపడ్డాడు. శనివారం తన స్వగ్రామమైన గొట్టిపర్తిలో వ్యవసాయ క్షేత్రంలోచెట్టుకు ఉరివేసుకొని మరణించాడు.

December 15, 2024 / 08:02 AM IST

రైలు నుంచి పడి వ్యక్తికి గాయాలు

MBNR: రైలు నుంచి పడి ఒక వ్యక్తి తీవ్ర గాయాల పాలైన ఘటన దేవరకద్ర రైల్వే స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. రైల్వే ఎస్ఐ అక్బర్ వివరాల ప్రకారం.. దేవరకద్ర రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి రైలు నుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ వ్యక్తిని అంబులెన్స్ లో ఉస్మానియా ఆసుపత్రికి తరలించామన్నారు.

December 15, 2024 / 07:25 AM IST

భర్తపై హత్యాయత్నం కేసు పెట్టిన భార్య..!

VSP: భార్యను చంపేస్తానని బెదిరిస్తున్న భర్తపై విశాఖ 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం కేసును శనివారం నమోదు చేశారు. నగరంలో చిన్న వాల్తేరుకు చెందిన దుర్గాప్రసాద్ శ్రావణి అనే యువతిని 2022లోవివాహం చేసుకున్నాడు. సంవత్సరం తర్వాత వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో భర్తపై వేధింపులు కేసు పెట్టారు. ఇటీవల చంపేస్తానని బెదిరిస్తూ ఉండడంతో శ్రావణి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

December 15, 2024 / 07:18 AM IST

కూతురుపై కన్నేసి.. తండ్రిని హత్య చేసిన వ్యక్తి

ELR: ఏలూరులో దారుణ ఘటన జరిగింది. తన కూతురిని ఇచ్చి పెళ్లి చేయాలని గొడవ పడుతూ వెంకట రాజు (44) అనే వ్యక్తిని నాని అనే యువకుడు శనివారం కత్తితో పొడిచి హత్య చేశాడు. మృతుడి కుమార్తెను నాని తరుచూ వేధించేవాడని.. దీంతో వెంకటరాజు పిల్లల్ని తీసుకుని ఉంగుటూరుకి వెళ్లి ఉంటున్నారు. పని మీద ఏలూరు వచ్చిన వెంకటరాజుతో నాని గొడవపడి హత్య చేశాడని సీఐ కోటేశ్వరరావు తెలిపారు.

December 15, 2024 / 07:14 AM IST

వాహనం ఢీకొని మహిళ మృతి

GDL: అయిజ మండల కేంద్రంలో శనివారం సాయంత్రం గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని 45 ఏళ్ల వయసు గల మహిళ మృతి చెందినట్లు టౌన్ ఎస్ఐ కళ్యాణ్ రామ్ తెలిపారు. మహిళను గుర్తించిన వారు గద్వాల టౌన్ పోలీసులను సంప్రదించారు. ఆమె మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రి మార్చురీలో ఉంచారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు.

December 15, 2024 / 07:09 AM IST

కవాడిగూడలో గంజాయి సేవిస్తున్న ఇద్దరు అరెస్ట్

HYD: గాంధీనగర్ PS పరిధిలో గంజాయి సేవిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. కవాడిగూడలో ఇద్దరు గంజాయి సేవిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ గంజాయి సేవిస్తున్న బన్సీలాల్ పెటకు చెందిన పి.సైమన్ (24), బాగ్ లింగంపల్లికి చెందిన డి.లోకేశ్(23)ను తనిఖీ చేశారు.

December 15, 2024 / 07:05 AM IST

వ్యభిచార గృహంపై పోలీసులు దాడి

SKLM: పోలాకి మండలంలో జడూరు గ్రామంలో కొంత కాలంగా వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు శనివారం రాత్రి వ్యభిచార గృహంపై దాడి చేశారు. అప్పటికే అక్కడ ఉన్న ఓ మహిళను, విటుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు నిర్వాహకులను అరెస్టు చేసినట్లు ఎస్సై రంజిత్ తెలిపారు.

December 15, 2024 / 07:03 AM IST

కుటుంబ తగాదాలతో చేనేత కార్మికుడి ఆత్మహత్య

JN: కుటుంబ తగాదాలతో చేనేత కార్మికుడు రైలు కింద పడి మృతి చెందిన ఘటన జిల్లాలో జరిగింది. జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జనగామలోని వీవర్స్ కాలనీకి చెందిన చేనేత కార్మికుడు కారంపూరి చంద్ర మౌళి(45) రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జనరల్ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

December 15, 2024 / 06:58 AM IST