ఏ పార్టీలో చేరతామనే అంశంపై జూపల్లి కృష్ణారావు క్లారిటీ ఇవ్వడం లేదు. వరసగా కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశం అవుతున్నారు. నిన్న మల్లు రవిని కలువగా.. ఈ రోజు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మీట్ అయ్యారు.
ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీలో విషాదం చోటుచేసుకుంది. గుండెపోటుతో ములుగు జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ మృతి చెందారు. ఆయన మృతికి పలువురు సంతాపం తెలుపుతున్నారు.
అప్సర హత్య కేసులో మరో విషయం బయటికొచ్చింది. అప్సరకు ముందే వివాహం అయినట్లు విచారణలో తేలింది. భర్త నుంచి విడిపోయి ప్రస్తుతం ఆమె పుట్టింట్లో ఉండగా సాయికృష్ణతో ప్రేమలో పడింది. చివరికి అతని చేతిలోనే ఆమె హత్యకు గురైంది.
పల్లెటూరు అంటే పండగలు, పబ్బాలకు మాత్రమే ఇంటికెళ్లే ఊరు అన్నట్లు మారిపోయిన ఈ కాలంలో..పల్లెటూరి కుర్రోడి ఆశలు, ఆకాంక్షలు ఎలా ఉంటాయనే కథాంశంతో మట్టికథ మూవీ తెరకెక్కింది. తాజాగా ఈ మూవీకి మూడు అంతర్జాతీయ అవార్డులు లభించాయి.
తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సీఎం కేసీఆర్ పేరును పచ్చబొట్టగా వేయించుకున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.