• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

యువకుడు ఆత్మహత్యాయత్నం

W.G: పెరవలి మండలం ఖండవల్లి గ్రామంలో కోడి పందేల బరి వద్ద జరిగిన ఘర్షణలో ఒక యువకుడు కాగుతున్న నూనె ఒంటిపై పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కొమ్మిశెట్టి గంగాధర్ మంగళవారం రాత్రి గుండాట వద్ద జరిగిన ఘర్షణలో అక్కడే కాగుతున్న నూనెను ఒంటిపై పోసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బాధితుడిని చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

January 15, 2025 / 07:20 AM IST

ఖమ్మం శివారులో మహిళ సూసైడ్

KMM: చెట్టుకు ఉరి వేసుకొని ఓ మహిళ మృతి చెందిన ఘటన ఖమ్మం రూరల్ మండలంలో ఈ ఉదయం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరి క్రాస్ రోడ్ సమీపంలో గుర్తుతెలియని మహిళ చెట్టుకు ఉరివేసుకొని సూసైడ్ చేసుకుంది. స్థానికులు గమనించి పోలీసులకు సమచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

January 14, 2025 / 09:49 AM IST

మనవడిని హత్య చేసిన తాత అరెస్ట్

W.G: వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామంలో మద్యం మత్తులో మనవడు చింతా నాగరాజును హత్య చేసిన తాత ఆదినారాయణను సోమవారం అరెస్ట్ చేసినట్లు నరసాపురం రూరల్ ఎస్ఐ వెంకట సురేశ్ తెలిపారు. శనివారం రాత్రి మద్యం తాగి తాత మనవడు మిగిలి ఉన్న మద్యం బాటిల్ కోసం గొడవపడ్డారు. వివాదంలో తాత మనవడి చాకుతో పొడిచి చంపిన విషయం విధితమే. సోమవారం ఆదినారాయణను న్యాయస్థానంలో హాజరు పరిచారు.

January 14, 2025 / 08:16 AM IST

ఎల్. కోటలో చెరువులో పడి వ్యక్తి మృతి

VZM: ఎల్.కోట మండలంలో పండగ పూట విషాదం చోటుచేసుకుంది. మల్లివీడుకు చెందిన వీరనాగా పాత్రుడు చెరువులో పడి మృతిచెందినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. సాయత్రం బహిర్భూమికి వెళ్లిన పాత్రుడు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందినట్లు స్థానికులు పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

January 14, 2025 / 07:50 AM IST

మద్యం షాప్ వద్ద వ్యక్తిపై దాడి

ఒంగోలు నగరం బండ్లమిట్టకు చెందిన పి. శ్రీనివాసరావు మద్యం తాగేందుకు అద్దంకి బస్టాండ్ వద్ద ఉన్న మద్యం షాప్ వద్దకు వచ్చాడు. అక్కడ తన సెల్ పడిపోగా వెతుకుతున్నాడు. అక్కడ మద్యం మత్తులో ఉన్న కొంతమంది యువకులు శ్రీనివాసరావుపై తీవ్రంగా దాడిచేసి కొట్టారు. వెంటనే స్థానికులు వైద్యశాలకు తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

January 14, 2025 / 07:49 AM IST

గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి

SRPT: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన చివ్వేంల మండలం అక్కలదేవి గూడెంలో చోటుచేసుకుంది. ఎస్సై మహేశ్వర్ వివరాల మేరకు.. ఖమ్మంకు చెందిన ఉమ్మెత్తెల కిరణ్ పద్మాకర్ ద్విచక్ర వాహనంపై హైదరాబాదు నుండి ఖమ్మం వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

January 13, 2025 / 12:55 PM IST

పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులు అరెస్టు

VZM: బొబ్బిలి మండలం దిబ్బగుడ్డివలస గ్రామ శివార్లలో పేకాట ఆడుతున్న వారిపై బొబ్బిలి ఎస్సై రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేసి, పేకాట ఆడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ. 35,200 నగదు, 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమేశ్ వెల్లడించారు.

January 12, 2025 / 06:56 PM IST

కొత్తూరుపల్లిలో మహిళా దారుణ హత్య

MNCL: జన్నారం మండలంలోని కొత్తూరు పల్లిలో ఒక మహిళ దారుణ హత్యకు గురైంది. జన్నారం మండల ఎస్సై రాజ వర్ధన్ కథనం ప్రకారం.. ఆ గ్రామానికి చెందిన మడావి కౌసల్య అనే మహిళను అదే గ్రామానికి చెందిన కృష్ణ అనే వ్యక్తి హత్య చేశారని తెలిపారు. ఒక చిన్నపాటి గొడవ మహిళా హత్యకు దారితీసిందని ఎస్ఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

January 12, 2025 / 10:57 AM IST

ఆల్ఫాజోలం తయారీ ముఠా గుట్టురట్టు

SRD: నిషేధిత ఆల్ఫాజోలం తయారు చేస్తూ విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు చేసినట్లు ఎస్పీ రూపీస్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దీనితోపాటు అక్రమంగా 60 కోట్ల రూపాయల ఆస్తులు కూడా కూడబెట్టినట్లు చెప్పారు. ఈ ముఠాను పట్టుకున్న గుమ్మడిదల పోలీసులను ప్రత్యేకంగా అభినందించారు.

January 11, 2025 / 12:27 PM IST

వాహనం ఢీకొని వృద్ధురాలు మృతి

MDK: నడుచుకుంటూ వెళ్తున్నా వృద్ధురాలిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన మూసాయిపేట మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. మృతురాలు మండలంలోని హక్కింపేట్ గ్రామానికి చెందిన పత్తి కృష్ణమ్మ (80) గా గుర్తించారు. మేడ్చల్లో ఉంటున్న తన కూతురు వద్దకు వెళుతున్న క్రమంలో సర్వీస్ రోడ్డులో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మృతి చెందింది.

January 10, 2025 / 05:51 PM IST

కార్చిచ్చు నేపథ్యంలో చెలరేగుతున్న దొంగలు

అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో రేగిన కార్చిచ్చు కారణంగా అక్కడి స్థానికులు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఈ క్రమంలో దొంగలు రెచ్చిపోతున్నారు. ధనవంతుల ఇళ్లల్లోని విలువైన వస్తువులను చోరీ చేస్తున్నారు. ఇప్పటికే 20 మంది దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎవరైనా వదిలేసిన ఆస్తులను లూటీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు పలు ప్రాంతాల్లో గస్తీ ఏర్పాటు చేశారు.

January 10, 2025 / 11:16 AM IST

ఉరేసుకుని ప్రభుత్వ ఉద్యోగి సూసైడ్

HNK: ఓ ప్రభుత్వ ఉద్యోగి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం మండలంలోని హౌజుజుర్గ్ గ్రామానికి చెందిన కమలాకర్(37)పరకాల డివిజన్లోని మిషన్ భగీరథలో పని చేస్తున్నారు. కాగా,ఇతడికి ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరడం లేదు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన కమలాకర్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు.

January 10, 2025 / 08:07 AM IST

ఎలక్ట్రానిక్ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం

NRML: జిల్లాలో గత రాత్రి కుబీర్ మండల కేంద్రంలోని భారీ అగ్నిప్రమాదం జరిగింది. మండల కేంద్రంలోని అన్నపూర్ణ డిజిటల్స్ & ఎలక్ట్రానిక్స్ దుకాణంలో గతరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. కాగా ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

January 10, 2025 / 06:54 AM IST

తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు మృతి

NTR: గీత కార్మికుడు మృతి చెందిన జగ్గయ్యపేట మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని షేక్ మొహమ్మద్ పేటలో తాటి చెట్టుపై నుంచి ప్రమాదవశాత్తు కిందపడి గీత కార్మికుడు చలమయ్య మరణించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. బాధిత కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

January 6, 2025 / 12:42 PM IST

కారు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

NRML: నర్సాపూర్(జి)మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ వద్ద సోమవారం రోడ్డుపై కారు ఢీకొన్న ఘటనలో మార్నింగ్ వాక్ చేస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల మేరకు నర్సాపూర్ (జి)కి చెందిన ఇద్దరు వ్యక్తులు గంగారెడ్డి, గణపతి రోడ్డుపై మార్నింగ్ వాక్ చేస్తుండగా వెనక నుంచి కారు ఢీకొనగా ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

January 6, 2025 / 09:02 AM IST