కోనసీమ: మానసిక సమస్యలతో బాధపడుతున్న ఓ వ్యక్తి మండపేటలో వాటర్ ట్యాంక్పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సామర్లకోట మండలం వేట్లపాలెంకు చెందిన మోర్త సూరిబాబు మంగళవారం బురుగుంటచెరువు దగ్గర వాటర్ ట్యాంక్పై నుంచి దూకాడు. స్థానికులు 108లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. ఈ ఘటనపై టౌన్ ఎస్సై జి.చంటి కేసు నమోదు చేశారు.