MDK: మనోహరాబాద్ మండలం కోనాయపల్లి (పిటి) గ్రామానికి చెందిన రావెల్లి దుర్గయ్య చెరువులో మునిగి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబీకుల దశదినకర్మ పురస్కరించుకుని చెరువులో స్నానం చేసేందుకు వెళ్లిన దుర్గయ్య కాలుజారి చెరువులో పడి మృతి చెందాడు. గజ ఈతగాల్ల సహాయంతో బయటకు తీసి పోస్టుమార్టం కోసం తరలించారు.