AP: ప్రకాశం జిల్లా కొరిశెపాడు మండలం గుడిపాడు దగ్గర ప్రమాదం జరిగింది. బైక్ను బొలేరో వాహనం ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.