అమెరికా(America)లో ఏపీకి చెందిన 23 ఏళ్ల కందుల జాహ్నవి పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొట్టి మృత్యువాత చెందింది. అయితే ఆ క్రమంలో విచారణ కోసం అక్కడికి వచ్చిన పోలీస్ అధికారి యువతి మృతి పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యాఖ్యలు చేశారు. ఇటివల ఆ వీడియో వెలుగులోకి రావడంతో అనేక మంది అతని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై జైలులో ఉన్న చంద్రబాబు నాయుడును కలిసేందుకు రాజమండ్రి చేరుకున్నారు.
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర బాబునాయుడు(chandrababu naidu)ను 5 రోజుల క్రితం సీబీఐ అధికారులు ఆంధ్రప్రదేశ్లో అరెస్టు చేసిన విషయం అందరినీ షాక్కి గురి చేసింది. ఈ ఘటన నేపథ్యంలో సీఎం జగన్, ఏపీ ప్రభుత్వం చర్యను ప్రాంతీయ, జాతీయ పార్టీలన్నీ ఖండిస్తున్నాయి. అయితే ఈ అంశంపై సూపర్ స్టార్ రజినీకాంత్ స్పందించారు.
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలో నేటితోపాటు వచ్చే మూడు రోజులు వర్షాలు(rains) కురియనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న చంద్రబాబు 13 చోట్ల సంతకాలు చేసినట్లు ఓ రిపోర్ట్ను సీఐడీ డీజీ సంజయ్ వెల్లడించారు. ఈ కేసులో రూ.241 కోట్లను నేరుగా ఓ కంపెనీకి మళ్లించినట్లు ఆధారాలు ఉన్నాయన్నారు.
ఏపీలో మరో మూడు గనుల్లో బంగారం తవ్వకాల కోసం ఎన్ఎండీసీ దరఖాస్తు చేసుకుంది. కర్నూలు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో బంగారం గనుల తవ్వకాల కోసం దాదాపు రూ.500 కోట్లను ఎన్ఎండీసీ సంస్థ పెట్టుబడి పెట్టనుంది.
రేపు చంద్రబాబుతో జనసేనాని ములాఖత్ కానున్నారు.
పార్టీ మారిన నేతలు అధినేతలను టార్గెట్ చేశారు. ఆర్కే రోజా, విడదల రజనీ, అవంతి శ్రీనివాస్.. కేసీఆర్ కూడా చంద్రబాబు లక్ష్యంగా విమర్శలు చేశారు.
ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. రెండు వర్గాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు క్వాష్ పిటిషన్ ను సెప్టెంబర్ 19కి వాయిదా వేసింది.
ఏపీ బీజేపీ చీఫ్ గా బాధ్యతలను స్వీకరించిన పురందేశ్వరి క్రమంగా దూకుడు పెంచుతున్నారు.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ1గా చంద్రబాబు పేరును చేర్చుతూ ఏపీ సీఐడీ పిటీషన్ వేసింది. ఈ కేసుపై రేపు న్యాయస్థానంలో విచారణ జరగనుంది.
ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి టీడీపీ కోవర్టు అని వైసీపీ ముఖ్యనేత, ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు.
కొడాలి నాని, పార్థసారథి, వంగవీటి రాధాపై విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు అరెస్ట్ వారెంట్ జారీచేసింది.
మేఘా కృష్ణారెడ్డికి తెలుగు రాష్ట్రాల సీఎంలతో మంచి అనుబంధం ఉంది. మీడియాలో వాటాలు కొని, ఆ రెండు పార్టీలను ప్రమోట్ చేస్తున్నారని తెలిసింది. ఆ ప్రభుత్వాల ద్వారా ప్రాజెక్టులు తీసుకుంటున్నారని సమాచారం.
సీఎం జగన్ను కలిసిన అడ్వొకేట్ జనరల్ సుబ్రమణ్యం శ్రీరామ్ భేటీ అయ్యారు