• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రేపు ఆ ప్రాంతాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం

SKLM: జలుమూరు మండలం బుడితి విద్యుత్తు ఉపకేంద్రం పరిధిలో నిర్వహణ పనుల కారణంగా జలుమూరు మండలంలోని గ్రామాలకు సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఆ శాఖ ఏఈ వి. వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. తిమడాం, పర్లాం, మాకివలస, అచ్యుతాపురం, శ్రీముఖ లింగం గ్రామాలకు సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు గమనించాలన్నారు.

September 22, 2024 / 04:27 AM IST

గ్రేడ్ 2 వీఆర్వోలకు కౌన్సెలింగ్

సత్యసాయి: పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలో వివిధ మండలాల్లో విధులు నిర్వహిస్తున్న గ్రేడ్ 2 వీఆర్వోల బదిలీపై శనివారం కలెక్టరేట్‌లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమం జిల్లా రెవిన్యూ అధికారి కొండయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇందులలో కలెక్టరేట్ పరిపాలన అధికారి వెంకటనారాయణతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

September 22, 2024 / 04:26 AM IST

రాష్ట్ర స్థాయి పోటీలకు గురుకుల విద్యార్థులు

నెల్లూరు: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్ 19 విభాగంలో జిల్లాస్థాయి క్రీడా పోటీలను చిల్లకూరు గురుకుల పాఠశాలలో శనివారం నిర్వహించారు. రెండు వందల మంది విద్యార్థులు ఈ క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. ఆయా క్రీడలలో ఉత్తమ ప్రతిభ చాటిన క్రీడాకారులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేసినట్లు ఎస్జీఎఫ్ సెక్రటరీ, పీడీ శిరీశ్ తెలిపారు.

September 22, 2024 / 04:25 AM IST

ఉగ్ర నరసింహ దేవాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

సత్యసాయి: మడకశిర మండలం యు.రంగాపురం క్రాస్‌లో ఉన్న ఉగ్ర నరసింహస్వామి దేవాలయాన్ని శనివారం రాత్రి ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, నియోజకవర్గ ఇంఛార్జ్ గుండుమల తిప్పేస్వామి సందర్శించారు. అక్కడికి వచ్చిన వారికి ఆలయ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు.  అర్చకులు ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో వారు పాల్గొని నరసింహ స్వామిని దర్శించుకున్నారు.

September 22, 2024 / 04:23 AM IST

కాళీపట్నం రైతులతో జేసీ సమావేశం

WG: మొగల్తూరు మండలం కాళీపట్నం ఈస్ట్ సచివాలయంలో పలువురు రైతులతో జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఇందులో కాళీపట్నం ఇనం ఎస్టేట్ భూములు సమస్యలు పరిష్కరించే దిశగా గ్రామంలోని పలువురు రైతుల నుంచి వారి అభిప్రాయాలను జేసీ అడిగి తెలుసుకున్నారు. భూముల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించే దిశగా రైతులు ముందుకు రావాలని అన్నారు.

September 22, 2024 / 04:22 AM IST

గురుకులానికి తాగునీటి సరఫరా పునరుద్దరణ

నెల్లూరు: నాయుడుపేటలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాలుర గురుకులానికి కిలోమీటర్ దూరంలో ఉన్న స్వర్ణముఖి నది నుంచి తాగునీటి సరఫరాను శనివారం తిరిగి ప్రారంభించారు. ఆరేళ్ల కిందట మోటర్ కొట్టుకుపోయి పైప్ లైన్లు మరమ్మతులకు గురయ్యాయి. దాత సన్నారెడ్డి దయాకర్ రెడ్డి నదిలో కొత్తగా బోరు వేసి తాగునీటి సరఫరాను పునరుద్ధరించారు.

September 22, 2024 / 04:22 AM IST

‘చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించండి’

విజయనగరం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలపాలని శ్రేణులకు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు సూచించారు. శనివారం విజయనగరం నియోజక వర్గ విస్తృత స్థాయి సమావేశం పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో జరిగింది. చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించిందన్నారు.

September 22, 2024 / 04:21 AM IST

నేడు సొసైటీ ఖాతాదారుల సర్వసభ్య సమావేశం

GNTR: ది కాకతీయ కో-ఆపరేటివ్ సొసైటీ తెనాలి ఖాతాదారుల సర్వసభ్య సమావేశాన్ని 22వ తేదీ నిర్వహిస్తామని ఛైర్మన్ దావులూరి లక్ష్మీ కాంతారావు శనివారం తెలిపారు. తెనాలిలోని సొసైటీ ఛైర్మన్ దావులూరి లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ.. తమ ఖాతాదారుల సర్వసభ్య సమావేశాన్ని నేడు ఎన్జీవో కల్యాణ మండపంలో నిర్వహిస్తామని తెలిపారు.

September 22, 2024 / 04:21 AM IST

’24న ఓటర్ల జాబితా డ్రాఫ్టు పబ్లికేషన్ విడుదల’

ప.గో: రాష్ట్ర శాసన మండలి తూర్పు, పశ్చిమగోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటర్ల జాబితా డ్రాప్టు పబ్లికేషన్ ఈనెల 24న విడుదల చేయబడుతుందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. ఏలూరు కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో శనివారం ఉపాధ్యాయ ఓటర్ల నవీకృత జాబితా రూపకల్పన, పోలింగ్ కేంద్రాల ప్రతిపాదనలపై గుర్తింపు పొందిన రాజకీయ పక్షాల ప్రతినిధులతో ఆమె సమావేశం నిర్వహించారు.

September 22, 2024 / 04:21 AM IST

పిల్లలను బాణసంచా తయారీలో ఉపయోగిస్తే కఠిన చర్యలు: జేసీ

WG: ప్రభుత్వ అనుమతులు లేకుండా మందు గుండు సామాగ్రి తయారు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా జేసీ టి. రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. నరసాపురం మండలం లక్ష్మణేశ్వరంలో మందు గుండు సామాగ్రి తయారు చేసే యూనిట్లను శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. 18 సంవత్సరాల్లోపు పిల్లలను బాణసంచా తయారీలో ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

September 22, 2024 / 04:20 AM IST

23న పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు

PLD: గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపడుతున్న కార్మికులకు స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఈనెల 23న పెదకూరపాడు సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు సీహెచ్సీ. వైద్యాధికారి డాక్టర్ విద్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ రుగ్మతలతో బాధపడుతున్న పారిశుద్ధ్య కార్మికులకు ఈసీజీ రక్త పరీక్షలు, నిర్వహిస్తారని డాక్టర్ తెలిపారు.

September 22, 2024 / 04:19 AM IST

దేవనకొండ PHCలో ఆశాదినోత్సవం

కృష్ణా: దేవనకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం ఆశా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆశాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, పని భారం తగ్గించాలని కోరారు. పత్తికొండ మలేరియా సబ్ యూనిట్ అధికారి సాయిబాబా, ఏఎన్ఎంలు, భాగ్యలక్ష్మి, విజయలక్ష్మి హనుమంతమ్మ, రంగస్వామి, శ్రీధర్ స్థానిక వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

September 22, 2024 / 04:19 AM IST

‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్

ప.గో: కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు గురించి ప్రజలకు వివరించడం ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ నాగరాణి అన్నారు. శనివారం మొగల్తూరు మండలం ముత్యాలపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అధికారులతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి తెలిపారు.

September 22, 2024 / 04:18 AM IST

సోమవారం మంగళంలో చల్లా పర్యటన

CTR: పుంగనూరు మండలం మంగళం పంచాయతీలో సోమవారం టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి పర్యటించనున్నట్లు టీడీపీ కార్యాలయం తెలిపింది. ఉదయం 9.30 గంటలకు జరిగే ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నట్లు తెలిపారు. నాయకులు, కార్యకర్తలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

September 22, 2024 / 04:15 AM IST

విజయవాడలో నాలుగు బైకులు స్వాధీనం

కృష్ణా: విజయవాడ సత్యనారాయణపురంలో ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్న ఓ వ్యక్తిని శనివారం అరెస్ట్ చేసినట్లు సత్యనారాయణపురం సీఐ బాల రాజాజీ తెలిపారు. విజయవాడకు చెందిన హేమంత్ కుమార్ కుట్టి అనే వ్యక్తి ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్నాడన్నారు. ద్విచక్ర వాహనాలు మాయమయ్యాయని పలు ఫిర్యాదులు రావడంతో నిఘా ఏర్పాటు చేసి ఇతనిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

September 22, 2024 / 04:15 AM IST