టీడీపీ నేత బండారు సత్యనారాయణ..మంత్రి రోజాపై చేసిన వ్యాఖ్యల గురించి తెలిసిందే. తాజాగా ఆ ఘటనపై నటి ఖుష్బూ మరోసారి స్పందించారు.
చంద్రబాబు ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదలైంది. బాబు జైల్లో బరువు తగ్గలేదని, ఇంకా బరువు పెరిగారని డీఐజీ రవికిరణ్ తెలిపారు. ఆయన బరువు తగ్గడంపై వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు.
ప్రస్తుత రాజకీయాలను చూస్తే చీదర వేస్తోందని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. కులాన్ని చూసి కాదు గుణాన్ని చూసి ఓటు వేయాలని కోరారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో భాగంగా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. జైలులో తీవ్ర ఉక్కపోత వల్ల ఆయన డీహైడ్రేషన్, అలర్జీతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. బాబు పర్సనల్ వైద్యులను ఆయన వద్దకు పంపి వైద్యం చేయించాలని డిమాండ్ చేస్తున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్పై ఏపీ సీఎం జగన్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆ కామెంట్లపై నిర్మాత బండ్ల గణేష్ స్పందించారు. పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడొద్దు అని హితవు పలికారు.
అంగళ్లు అల్లర్ల కేసులో ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకి హైకోర్టు ధర్మాసనం ముందస్తు బెయిల్ ఇచ్చింది.
జగనన్న సురక్ష పథకంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన మందులు కనిపించాయి. మందుల గురించి వైద్యాధికారిని అడిగితే తెలియదని చెబుతున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్కు హైదరాబాద్ మెట్రోలో నల్ల టీషర్ట్లు ధరించి నిరసనలు చేయనున్నారు. 'లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్' అనే ఈ కార్యక్రమంలో ఎవరైనా పాల్గొనవచ్చు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ను నిరసిస్తూ ఏపీతో పాటు తెలంగాణలో కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. టీడీపీ, జనసేన పార్టీ కార్యకర్తలతో పాటు ఐటీ ఉద్యోగులు, పలు సంఘాలు ఈ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. కానీ ఎన్టీఆర్ మాత్రం స్పందిచలేదు. తాజాగా దీనిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు రాజీవ్ కనకాల.
సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు తీవ్ర అలెర్జీతో బాధపడుతున్నారు. జైల్లో వాతావరణం వేడిగా ఉండటంతో ఆయన డీహైడ్రేేషన్కు గురయ్యారు. ప్రస్తుతం వైద్యులు ఆయన్ని పరీక్షిస్తున్నారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో టీడీపీ యువ నేత నారా లోకేశ్ భేటీకి సంబంధించి టీడీపీ ఏపీ కమిటీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు క్లారిటీ ఇచ్చారు.
తిరుపతిలో డబుల్ డెక్కర్ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. నేడు లాంఛనంగా ఒక బస్సును ప్రారంభించగా త్వరలో మరికొన్ని సందడి చేయనున్నాయి. ఇవి తిరుపతి నగరవాసులకు, తిరుమల భక్తులకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.
ఏపీలో రేషన్కార్డు ఉన్నవారికి ఈ నెల ఆఫ్లైన్లోనే సరుకులు ఇవ్వనున్నారు. ఈ మేరకు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సర్వర్ సమస్యలు రావడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు.
సరుకును అమ్ముకునే వారిని చూశాం.. సరంజామాను అమ్ముకునే వారిని చూశామన్నారు. సొంత పార్టీని, సొంత వర్గాన్ని.. వేరే వారికి అమ్ముకునే వ్యాపారిని మాత్రం ఇక్కడే చూస్తున్నామని పవన్ కల్యాణ్పై ఏపీ సీఎం జగన్ విరుచుకుపడ్డారు.
ఏపీలో ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలని సీఎం క్యాంప్ ఆఫీస్ను దసరాకు అమరావతి నుంచి విశాఖకు మార్చుతున్నారని తెలిసింది. ఈ క్రమంలో రుషికొండలో సీఎం జగన్ క్యాంప్ ఆఫీస్ పనులు మమ్మురంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.