అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ కేసులో భాగంగా నేడు సీఐడీ విచారణకు నారా లోకేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయనకు 49 ప్రశ్నలు వేశారు. మరికొంత సమాచారం కోసం రేపు కూడా హాజరు కావాలని లోకేశ్కు నోటీసులిచ్చారు.
జనసేనాని పవన్ కళ్యాణ్కు ఫీవర్ రావడంతో ఆ పార్టీ నిర్వహించి అన్ని సమావేశాలు రద్దయ్యాయి. సమావేశం తేదీలను త్వరలోనే ప్రకటించనున్నట్లు జనసేన పార్టీ ప్రకటనలో తెలిపింది.
ఏపీ హేట్స్ జగన్ అని ప్రజలు అంటున్నారని టీడీపీ నేత బోండా ఉమ అన్నారు.
ఏపీలో అరాచకపాలన కొనసాగుతుందని బీసీలపై జగన్ ప్రభుత్వం అక్కసును వెల్లగక్కుతుందని టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ అవినీతి పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమయిందని ధీమా వ్యక్తం చేశారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు సుప్రీంకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ వాయిదా పడింది. చంద్రబాబు తరఫు న్యాయవాది, సీఐడీ తరఫు న్యాయవ్యాది వాదనలు విన్న సుప్రీంకోర్టు ఈ కేసును శుక్రవారానికి వాయిదా వేసింది.
యువకుడితో కలిసి గుట్టలపై సెల్ఫీ తీసుకుంటుండగా ఓ యువతి ప్రమాదవశాత్తూ కాలు జారి పడిపోయింది.
రోజా చరిత్ర గురించి మీకు ఏం తెలుసు అని మంత్రికి అండగా నిలిచిన నేతలపై వంగలపూడి అనిత విరుచుకుపడ్డారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ను ఏసీబీ కోర్టు కొట్టేసింది. అదేవిధంగా బాబును కస్టడీకి కోరుతూ సీఐడీ ధాఖలు చేసిన పిటిషన్ను కూడా డిస్మిస్ చేసింది.
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నేడు సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సందర్బంగా శానిటరీ సిబ్బంది, కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. తిరుపతి నగర అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకోనున్నట్లు తెలిపింది.
ప్రజాధనాన్ని దోచి పత్రికకు సీఎం జగన్ కోట్ల డబ్బు పెడుతున్నారని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తమ ప్రభుత్వ హయాంలో జరిగిన మంచిని ప్రజలకు తెలియజేయాలని సీఎం జగన్ (CM Jagan) వైసీపీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. విజయవాడలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు.
ఆంధ్రప్రదేశ్లోని వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
మరోవైపు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరగనుంది.
టీడీపీ- జనసేన కమిటీకి సంబంధించి స్పష్టత వచ్చింది. సోమవారం మధ్యాహ్నాం ప్రకటించి.. ఆ వారంలో ఫస్ట్ మీటింగ్ నిర్వహించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనుకుంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో తిరుపతి నుంచి పోటీ చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ను టీడీపీ చీఫ్ చంద్రబాబు కోరారని తెలిసింది. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్.. ఈ సారి పోటీ చేసే స్థానాన్ని సరిగా ఎంపిక చేసుకోవాలని.. అందుకే తిరుపతి పేరు సజెస్ట్ చేశారని తెలిసింది.