మంత్రి రోజాపై బండారు సత్యనారాయణ చేసిన అనుచిత వ్యాఖ్యలను టీడీపీ నేతలు సమర్థిస్తున్నారని మంత్రి రోజా పేర్కొన్నారు. ఆయన మాట్లాడినా చెప్పడానికి కూడా కుదరదు అంటూ భావోద్వేగానికి లోన్నయ్యారు.
లోకేశ్ పై రేపటి సీఐడీ విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది.
తీవ్ర ఉత్కంఠ నడుమ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ను సుప్రీం కోర్టు విచారించింది. ఈ కేసులో సీఐడీ తరపు లాయర్లు తమకు కొంత గడువు కావాలని కోరడంతో సోమవారానికి కేసును వాయిదా వేస్తున్నట్లు సుప్రీం కోర్టు ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళిపై కేసు నమోదైంది. జనసేన నేతల ఫిర్యాదు మేరకు కోర్టు పోసానిపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు.
వైసీపీ సర్కార్కు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. అంగళ్లు కేసులో తాము కలగజేసుకోలేమని తేల్చి చెప్పింది. దీంతో వైసీపీ సర్కార్ పెట్టిన 6 పిటీషన్లను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.
తనకు ఇచ్చిన నోటీసులపై నారా లోకేశ్ రెండు లంచ్ మోషన్ పిటీషన్లు వేశారు. ఈ నేపథ్యంలో హైకోర్టు లోకేశ్ పిటీషన్లను విచారణకు స్వీకరించింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత వాటిపై విచారణ జరగనుంది.
తిరుపతి బస్టాండ్లో బాలుడు కిడ్నాప్కు గురయ్యాడు. బాలుడి ఆచూకీ కోసం పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. అయితే బాలుడిని ఏర్పేడులో ఓ మహిళ పోలీసులకు అప్పగించింది. దీంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు పిటీషన్పై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఏపీలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఏపీలో వైసీపీ, టీడీపీల మధ్య పొలిటికల్ హీట్ ఎక్కువైంది.
చంద్రబాబు అరెస్ట్కు వ్యతిరేకంగా నారా లోకేశ్ ఒక్క రోజు దీక్షను చేపట్టారు. ఈ రోజు సాయంత్రం ఆయన దీక్షను విరమించి మీడియాతో మాట్లాడారు. తమపై ఎన్నికేసులు పెట్టినా ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. క్వాష్ పిటిషన్ విచారణ తర్వాత టీడీపీ భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తుందన్నారు.
మంత్రి రోజాపై బండారు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గుంటూరు పోలీసులకు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో 41ఏ, 41బీ సెక్షన్ల కింద పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-5)లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 15-19 సంవత్సరాల వయస్సు గల యువతులలో 12.6 శాతం మంది ఇప్పటికే పిల్లలను కనడం ప్రారంభించారు.
తెలుగు రాష్ట్రాల్లో ఏకకాలంలో 60 చోట్ల ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. మావోయిస్టులు, ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే కారణంతో ప్రజా సంఘాల నేతలు, న్యాయవాదుల ఇంట్లో రైడ్స్ చేపట్టారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఢిల్లీలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దీక్షకు దిగారు.
మాజీ మంత్రి నారాయణకు సీఐడీ అధికారులు మరోసారి వాట్సాప్ ద్వారా నోటీసులు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని 60కి పైగా ప్రాంతాల్లో ఈరోజు ఉదయం నుంచి ఎన్ఐఏ దాడులు నిర్వహిస్తోంది. తీవ్రవాదం సహా నక్సల్స్ కేసుల్లో ఉన్న పలువురి అనుమానితుల ఇళ్లలో ఈ సోదాలను అధికారులు కొనసాగిస్తున్నారు.