అన్నమయ్య: మదనపల్లెలో భర్తను భార్య దారుణంగా హత్య చేసిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. 2వ పట్టణ CI రాజారెడ్డి వివరాల మేరకు రామారావు కాలనీలో ఉండే రామన్న(40) తాగి గొడవ చేస్తున్నాడని భార్య రవణమ్మ ఆమె తమ్ముడు ఈశ్వర్ రోకలిబండతో కొట్టి హతమార్చారు. రవణమ్మ ఈశ్వర్పై అనుమానంతో విచారించగా విషయం బయటపడింది. పాతిపెట్టిన రామన్న మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం చేశారు.