W.G: వీరవాసరం మండలం కొణితివాడ గ్రామానికి చెందిన మహిళ రైతుతో జిల్లా కలెక్టర్ నాగరాణి మంగళవారం ముఖాముఖి నిర్వహించారు. ఈ నేపథ్యంలో అధికారుల నుంచి అందుతున్న సహాయ సహకారాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాలలో ముందుండాలని ఆకాంక్షించారు. జిల్లాలోని ఏ రైస్ మిల్లుకైనా ధాన్యం తరలించుకోవచ్చునని మహిళా రైతుకు సూచించారు.