VZM: చీపురపల్లి జి.అగ్రహారంలో ఉంటున్న ఆదిబాబు బుధవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఈ మేరకు కుటుంబసభ్యులు వారి నేత్రాలను దానం చేయాలని నిర్ణయించుకుని రెడ్క్రాస్ కో ఆర్డినేటర్ గోవింద రాజులుకు తెలిపారు. దాంతో మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియన్ సుజాత, ఉమ శంకర్ ద్వారా అతని కార్నియాలు సేకరించి, విశాఖలోని ఎల్.వి.ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి ఇచ్ఛారు.