GNTR: గుంటూరు నగర ప్రజలు కాచి, చల్లార్చిన నీటిని తాగాలని, బయట ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలని సోమవారం కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా సూచించారు. తూర్పు నియోజకవర్గంలో 3 కలరా కేసులు గుర్తించి వారికి జీజీహెచ్లో చికిత్స అందిస్తున్నామని చెప్పారు. డయేరియా నియంత్రణ కోసం ప్రత్యేక బృందాల ద్వారా సర్వే చేయించి అన్నీ ముందస్తు చర్యలు చేపట్టామని చెప్పారు.