KRNL: బండి ఆత్మకూరు మండలం ఓంకార పుణ్యక్షేత్రం శ్రీ ఓంకార సిద్దేశ్వర స్వామి దేవస్థానంలో నంద్యాల డివిజన్ తనిఖీ అధికారి పి. హరిచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో బహిరంగ వేలం నిర్వహించారు. పాదరక్షలు గత సంవత్సరం రూ.80వేలు రాగా.. ఈ సంవత్సరం రూ.82 వేలు, ఐస్ క్రీమ్ బండ్లు అమ్ముకొనే హక్కుకు గత ఏడాది రూ.29,500/-లు రాగా ప్రస్తుతం రూ.31000/-లు ఆదాయం లభించింది.