కోనసీమ: గల్ఫ్లో పని చేస్తున్న సఖినేటిపల్లి మం.అంతర్వేది కరా గ్రామానికి చెందిన గంటా దీప్తిని వెట్టి చాకిరి నుంచి విముక్తి కలిగించి, ఇండియాకు రప్పించి తన కుటుంబ సభ్యులకు అప్పగించి మంత్రి సుభాష్ మానవత్వం చాటుకున్నారు. బాధితురాలు గంటా దీప్తి, తన భర్త త్రిమూర్తు, కుటుంబ సభ్యులతో మంగళవారం సుభాష్ను రామచంద్రపురంలో మర్యాదపూర్వంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.