VZM: బాడంగి మండలంలో వైసీపీకి షాక్ తగిలింది. ఆనవరం గ్రామానికి చెందిన 100 వైసీపీ కుటుంబాలు ఆ పార్టీని వీడి బొబ్బిలి కోటలో సోమవారం ఎమ్మెల్యే బేబినాయన సమక్షంలో టీడీపీలో చేరాయి. వీరందరికి బేబినాయన కండువాలు వేసి ఆహ్వానించారు. టీడీపీ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని చెప్పారు. నియోజకవర్గంలో టీడీపీని బలోపేతం చేస్తామని చెప్పారు.