కృష్ణా: 2024-29 నూతన పర్యాటక పాలసీని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కొత్త పర్యాటక పెట్టుబడిదారుల సమావేశంలో కొత్త పాలసీని విడుదల చేశారు. ఈ సందర్భంగా పెట్టుబడిదారుల నుంచి వినతులను స్వీకరించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. పెట్టుబడిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.