పల్నాడు: జిల్లాలో పంటల బీమా ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులకు కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశాలు ఇచ్చారు. మంగళవారం రబీ సీజన్ పంటల సాగుపై సమీక్ష నిర్వహించారు. వరికి రూ.630 చెల్లించి పంటల బీమా పథకంలో నమోదు కావాలని రైతులను చైతన్య వంతులను చేయాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 6000 హెక్టార్లలో సాగు జరిగిందన్నారు.