PPM: సీతంపేట గిరిజన గురుకుల బాలుర పాఠశాల నూతన భవన నిర్మాణానికి ఎమ్మెల్యే జయకృష్ణ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈమేరకు మౌలిక వసతుల కల్పన నిమిత్తం రూ.167.50 లక్షల నిధులు మంజూరయ్యాని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ ఛైర్మన్ బి.సంధ్యారాణి, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ జి. నీలంనాయుడు, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.