ELR: విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లోని రాగి వైర్లను దొంగిలిస్తున్న ముఠాను బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడుతూ.. ద్వారకాతిరుమల, భీమడోలు, లక్కవరం, తడికలపూడి టీ.నర్సాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం 41 ట్రాన్స్ఫార్మర్లలో రాగి వైరు చోరీ చేస్తున్న ముగ్గురుని అదుపులోకి తీసుకొని 639 కేజీల రాగిణి స్వాధీనం చేశారు.