ASR: అరకులోయ మండలంలోని బస్కి పంచాయితీ గుగ్గుడు గ్రామంలో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిపారు. అంబేద్కర్ స్ఫూర్తితో లౌకిక, ప్రజాస్వామ్య రక్షణకు, ఆదివాసీ హక్కులు చట్టాల అమలుకు పోరాడాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పొద్దు బాలదేవ్, మాజీ MPTC దశరథ్ అన్నారు. జీవో నెం.3 అమలు చేయాలని ఈ మేరకు ప్రభుత్వాన్ని కోరారు.