W.G: తాడేపల్లిగూడెం పట్టణంలోని భవిత దివ్యాంగుల శిక్షణ కేంద్రంలో బుధవారం డాక్టర్ అల్లు శ్రీ కృష్ణ మహేష్ దివ్యాంగుల పిల్లలకు ఫిజియోథెరపీ నిర్వహించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఇందులో ప్రత్యేక ఉపాధ్యాయుడు ఎస్కే బాల ఈశ్వరయ్య, ఎం చంద్ర కుమారి పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి జ్యోతి పాఠశాల ఉపాధ్యాయిని కే కుమారి పాల్గొన్నారు.