కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఈనెల 10వ తేదీన శుక్రవారం సంకటహర గణపతి వ్రతం వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ పెంచల కిషోర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి 11 వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 6 వరకు వేడుకలు జరుగుతాయన్నారు. రాత్రి పురవీధుల్లో స్వామివారి స్వర్ణ రథోత్సవం ఊరేగింపు ఉంటుందని తెలిపారు.