SKLM: నరసన్నపేట పట్టణ నడిబొడ్డున ఉన్న గోరువాని చెరువు నేడు మురికి కూపంగా మారిపోతుంది. దీనిపై పంచాయితీ అధికారులు సరియైన పర్యవేక్షణ చేయకపోవడం వలన ఈ పరిస్థితి వచ్చిందని స్థానిక వాసులు వాపోతున్నారు. ఈ చెరువు అభివృద్ధిపై అధికారులు దృష్టి సాధించి అభివృద్ధి చేయాలని ఆదివారం స్థానిక వాసులు కోరుతున్నారు.