GNTR: గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో జరుగుతున్న ఆకస్మిక మరణాలపై పూర్తి స్పష్టత ఇవ్వాలని వైసీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇంఛార్జ్ బలసాని కిరణ్ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్లో బలసాని ఈ మేరకు ఒక వినతిపత్రం సమర్పించారు. తురకపాలెం పర్యటనల సమయంలో ఒక్కో నాయకుడు ఒక్కో మాట మాట్లాడుతున్నారని దానివల్ల అందరూ బయపడుతున్నారన్నారు.