SKLM: టెక్కలి మండలం పాత నౌపాడ పంచాయతీ సర్పంచ్ దల్లి సంధ్య లోకేష్ రెడ్డి తల్లి మంగళవారం మరణించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆమె అంత్యక్రియలో పాల్గొన్నారు. ఆమె ఆత్మ శాంతి చేకూరాలని కోరారు. ఆయనతో పాటు ఎంపీటీసీ సభ్యులు అప్పల రెడ్డి, వైసీపీ నాయకులు యోగేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.