VSP: జీఎస్టీ ప్రాముఖ్యత -‘సూపర్ సేవింగ్స్’పై ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో విశాఖ జిల్లా కలెక్టరేట్ నుంచి గురువారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ ర్యాలీలో అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని, జీఎస్టీ విధానం గురించి ప్రజలకు సందేశాలను అందించారు.