సత్యసాయి: హిందూపురం వన్ టౌన్ పరిధిలో నిర్లక్ష్యంగా వాహనాలు నడిపిన ఆరుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ.. కొల్లకుంట సమీపంలో ఎదురుగా వస్తున్న వారిని ఢీకొట్టి ప్రమాదానికి గురిచేశారు. నిందితుల నుంచి రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పెనుకొండ పోలీసులు మీడియాకు తెలిపారు.