NTR: ఏ కొండూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి పీ హరిప్రియ(36) గుండెపోటుతో బుధవారం మృతి చెందారు. ప్రసవ సమయంలో పాపకు జన్మనిచ్చి ఎంపీడీవో హరిప్రియ మృతి చెందడం జరిగింది. హరిప్రియ మృతికి సంతాప సూచకంగా ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది మౌనం పాటించారు. ప్రజలతో మమేకం అవుతూ, ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో హరిప్రియ ముందుండేవారన్నారు.