TPT: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులతో భూ సమస్యలు పరిష్కారం అవుతుందని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే కోనేటి బుచ్చినాయుడు కండ్రిగ మండలంలో పర్యటించి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొదట బుచ్చినాయుడు కండ్రిగ మండలం కాటూరులో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే పాల్గొని ప్రసంగించారు.