CTR: నగరంలోని ఒక ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో మాజీ మేనేజర్ ఉదయ్ రాజ్, ఉద్యోగిని రేవతి కలిసి 40 నకిలీ ఐడీలను సృష్టించి, రూ.17 లక్షల రుణం స్వాహా చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు సంస్థ ఉద్యోగి ఫకృద్దీన్ ఈ విషయాన్ని గుర్తించి, న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అనంతరం న్యాయస్థానం సూచనల మేరకు చిత్తూరు వన్ – టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.