AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ 14వ వార్డు సుబ్బారాయుడుపాలెంలో శనివారం శ్రీసీతారాముల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి గోపూజ, పునఃపూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నసమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ ప్రతిష్ఠ మహోత్సవానికి నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేశ్ హాజరై సీతారాములు దర్శించుకున్నారు.