SKLM: సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేదలకు ఆర్థిక భరోసా కలుగుతుందని పలాస ఎమ్మెల్యే శిరీష అన్నారు. బుధవారం తన కార్యాలయంలో బాతుపురం గ్రామానికి చెందిన బత్తిని కామేశ్వరరావు కుమారుడు కిషోర్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన రూ.3 లక్షల చెక్కును ఎమ్మెల్యే శిరీష తన కార్యాలయంలో కామేశ్వరరావు కుటుంబ సభ్యులకు అందజేశారు.